బారత తొలి స్వాతంత్ర సంగ్రామం(1851) నుండి 1947 దాకా జరిగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న భూమి పుత్రులను బ్రిటీష్ పాలకులు బలి తీసుకున్నారు. కొందరిని బాని సలుగా, పీడితులుగా మార్చారు. రాజ దురాక్రమణ దారులైన తెల్ల దొరలు ఆదివాసులపై కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం ప్రకటిస్తూ తాంతియా భీల్, రాణి దుర్గా వతి, రాణి మా గై జిన్నూ, బిర్సా ముండా, రాంజీ గోండ్ మొదలైన ఆదివాసీ యోధులను బలిగొన్నారు. మధ్య భారత దేశంలో క్రీ.శ 12401749 మధ్య మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర చత్తీస్ గఢ్ , ఒడిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో - ఏర్పడిన ఆదివాసీ గోండ్వానా రాజ్యంలో రాజులుగా వెలుగొందిన గోండు గిరిజన పాలకులకు, జమీన్ దారులను, మోకాసలను సైతం బలి గొన్నారు. గోండ్వానా సమశీలురలో పులిలాంటి యోధుడు యోధుడు పులిసూర్ బాబురావ్ సెకీ.. గోండ్వానా రాజ్యంలో సిడ్మికీ ఆది యోధుడు . మధ్యభారతావనిలో గోండ్వానా ప్రాంతమైన - చంద్రాపూర్ మహారాష్ట్రలోని గోండులు సెకీ ఆధ్వర్యంలో తిరుగుబాటు (1856-58) చేయగా, మరోవైపు ఆదిలాబాద్ సరిహద్దుల్లో మార్చికల్ల రాంజీ గోండ్ బ్రిటిష్ సైన్యాలపై రోహిల్లాలుగోండుల తిరుగుబాటు (1857-60) ఉద్విగ్నంగా జరిగింది. భారత స్వాతంత్ర్యసమరంలో ఆరిపోతున్న - దీపాలను వెలిగిస్తున్నట్లు ...... నేల కొరిగిన వీరుని స్థానంలో మరొకరిని ఎదిగేలా చేసి తెల్ల దొరతనంపై ఎదురుదాడికి సిద్ధం చేశాడు. ఎన్నో సవాళ్ళను, ప్రతి బంధ కాలను ఎదుర్కొంటూ గోండ్వానా రాజ్య సంరక్షణ సమరానికి నాయకత్వం వహించిన గోండ్వాన వీరుడు సెడ్మాక. గోండ్వానా లో అంతర్భాగమైన మహరాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండి . గ్రామంలో జమీందార్ కుటుంబంలో 1833, మార్చి 12న జన్మించిన సెడికీ బాల్యం నుంచే అస్త్ర, శస్త్ర విద్యలో నైపుణ్యం సాధించి 28 ఏళ్ళకు - జమీందారీ వంశ వారసుడిగా బాధ్యతలు | తీసుకున్నాడు దురాక్రమణ, దుశ్చర్యల నుండి గోండ్వానా రాజ్య రక్షణకు ప్రతిజ్ఞ చేశాడు. తెల్ల దొరల ఆక ృత్యాలను, వారి దాడులను తిప్పి కొట్టడానికి కోయరు లను, మరాఠీలు, ముస్లీం | లను కూడా ఏకం చేసి, తన - సైన్యంతో తెల్ల దొరలపై తొలిసారి 1858, మార్చి 22న యుద్ధం ప్రకటించాడు, ఆ యుద్ధంలో బ్రిటీష్ సైన్యాన్ని సెడ్మాకీ చిత్తుగా ఓడించాడు. బ్రిటీష్ కెప్టెన్ క్రికటన్ సారధ్యంలో సిగ్నాపూర్ పరిసరాలలో గోండులపై దండెత్తినా పరాజయం తప్పలేదు. పైగా చంద్రాపూర్వైపు పారిపోయి తలదాచుకున్నారు. బ్రిటీష్ బలగాలు సెడాకిని ఓడించడానికి బ్రిటీష్ సైన్యాధిపతిగా నెక్స్పయారు. యుద్ధానికి పంపించారు. ఆధునిక ఆయుధాలు కొరవడినప్పటికీ గోండు సైన్యాలు సాంప్రదాయక బరిసెలు, బల్లెములు, బడి తెలు, కత్తులతోనే ఎదుశ్శాని బ్రిటిష్ సైన్యాలను ఓడించారు. యుద్ధంలో పరాజయాన్ని జీర్ణించుకోలేని బ్రిటీష్ ప్రభుత్వం సెనికిని కొరియర్ ద్వారా నిర్బంధించడానికి ప్రణాళికలు చేసింది. క్రికటన్, నెక్స్పయాల సెడ్మాకిని పట్టించిన వారికి కానుకగా జమీందారీగా నియమిస్తామని ప్రకటించారు. తనకు ఆశాదీ రాజపుత్రిక లక్ష్మీబాయి నమ్మినబంటు కావనంలో - రక్షణార్థం ఆమె వద్దకు తరచూ వెళ్ళేవాడు. ఆమె సెకీ - పోరాట పటిమను ప్రశంసిస్తూ, తనవద్ద విశ్రాంతి తీసుకోవాలని కోరింది . ఆమె నమ్మక ద్రోహంతో సైన్యానికి సమాచారం తెలిసి రాత్రికి రాత్రే ఆంగ్లేయులు నిద్రలోని సెకీని బందిలో - చంద్రాపూర్ తరలించారు. తెల్ల దొరల కబంద హస్తాలకు చిక్కి, 1858 అక్చి బర్ 21న ఉరితీయబడిన బాబురావ్ సెడాకీ అజరామరుడు. స్వతంత్ర్య భారత సంగ్రామంలో గోండ్వానా రాజ్య పరిరక్షణకు, గోండ్వానా స్వయం పాలనకు కృషి చేశాడు. సెంకి ప్రపంచ ఆదివాసీల పోరాట చరిత్రలో ఒక ధృవతార , సెక్రీ గోండ్వానా రాజ్య కోటలు నేటికీ చంద్రా పూర్ లో దర్శనమిస్తాయి. సెడ్మికి నుండి తెలంగాణ లోకుమ్రంభీం దాకా ఆదివాసీలు తమ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన వీర యోధులు, స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్ళయినా ఆదివాసీలు తమ అస్థిత్వ, ఆత్మగౌరవ పోరాటాల వారసత్వ న్ని కొనసాగిస్తూ జన్- జంగల్-జమీన్ కోసు, స్వయం పాలనా ధికారాల కోసం ఎదురుచూడటం తప్ప ఆదివాసీలకు వేరే గత్యంతరం లేదేమో! (మార్చి 12న వీరబాబురావ్ సెడ్మాకీ 185వ జయంతి) -
గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ
రచయితల సంఘం వ్యవసాపక కార్యదర్శి
సెల్: 9491318409.